calender_icon.png 24 February, 2026 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితులను ఉరి తీయాలి

24-02-2026 12:36:33 AM

బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్

ముషీరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కుమ్మెర ఘటనలో నిందితులను ఉరితీయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో పాటు సభ్యులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విక్రమ్‌గౌడ్ మాట్లాడుతూ..

కుమ్మెర గ్రామంలో అగ్రకుల అహంకారంతో సర్పంచ్ తుకారాంరెడ్డి, సతీష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇతర సభ్యులతో కలిసి దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమయ్యారన్నారు. ఇలాంటి నరరూప రాక్షసులను ఉరి తీయాలన్నారు.  బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.