25-06-2025 01:24:55 AM
దీనివల్ల అనాదిగా వస్తున్న గిరిజన సంప్రదాయం తెలుసుకునే అవకాశం
మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సుభాష్
భద్రాచలం, జూన్ 24 (విజయక్రాంతి)తాతల కాలం నుండి పాటిస్తున్న గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోకుండా నేటితరం గిరిజన యువతి, యువకులు తెలుసుకొని ఆచరించి కాపాడుకునే విధంగా గిరిజన మ్యూజియంను తయారు చేయడం సంతోషకరమని మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ న్యూఢిల్లీ (మోట) ప్రత్యేక అధికారి సుభాష్ అన్నారు.
మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రత్యేక అధికారి భద్రాచలం డివిజన్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను సందర్శించి మ్యూజియంలోని కళాఖండాలు పెయింటింగ్ చిత్రాలు, ట్రైబల్ వంటకాలను ఆస్వాదించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటకులకు కనువిందు కలిగేలా ట్రైబల్ మ్యూజియంను రూపొందించి పాత తరం గిరిజనులు వాడుకునే వస్తువులు, ధరించే ఆభరణాలు చాలా బాగున్నాయని, మ్యూజియంలోని ప్రతి కళాఖండాలు సహజత్వం ఉట్టిపడేలా ఉన్నాయని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో రెండు రోజులు పర్యటన చేసి దేవాలయాలతో పాటు మ్యూజియంను కూడా సందర్శించడం వలన మంచి అనుభూతి కలిగిందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకా లు గిరిజనులకు సక్రమంగా అందుతున్నాయని అందుకు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తన ఛాంబర్ లో కలిసి గిరిజన గ్రామంలో గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించిన అనంతరం పిఓ వారిని సన్మానించి జ్ఞాపకను అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.