25-06-2025 01:26:25 AM
రాజేంద్రనగర్, జూన్ 24: ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడిన సంఘటన మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకా రం.. బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు కొంతకాలంగా లక్ష్మీగూడలోని రాజీవ్ గృ హకల్ప ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
స్థానికంగా పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. ఇదిలా ఉండగా వారి మూడేళ్ల కుమారుడు ప్రిన్స్ మంగళవారం ఉదయం 11 గంటలకు ఆడుకుంటూ సమీపంలో ఉన్న బావిలో పడిపోయాడు. వెంట నే గమనించిన స్థానికులు ప్రిన్స్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఘట నా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ నరేందర్ సిబ్బందితో అక్కడి కి చేరుకొని వివరాలు సేకరించారు.
బాబి గతంలో వ్యవసాయానికి ఉపయోగించినది రావడంతో భారీ లోతుగా వెడల్పుగా ఉం దని ఆయన తెలిపారు. వెంటనే డిఆర్ఎఫ్ ఫైర్స్ సిబ్బందిని ఘటన స్థలానికి చేరుకొని నీటిని తోడుతున్నట్లు తెలియజేశారు. బాలు డి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోవడంతో ప్రిన్స్ తల్లిదండ్రు లు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.