calender_icon.png 10 June, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్ ప్రజల మనసు గెలవాలి!

04-06-2025 12:00:00 AM

జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా శాంతికి మార్గం కావాల్సిన అవసరం ఉం ది. రాజకీయ సమస్యలకు రాజకీయ పరిష్కారాలు ఉండాలనేది ప్రాథమిక సూత్రం మాత్రమే.  కానీ, మరోవైపు సిమ్లా ఒప్పం దం అంటూ ఒకటి ఉన్నప్పటికీ పాకిస్థాన్, అది పెంచి పోషిస్తున్న లేదా మద్దతు ఇస్తు న్న ఉగ్రవాద యంత్రాంగం ఇరువర్గాలు కలిసి కశ్మీర్ సమస్యను అక్కడి ప్రజలను పాములా చుట్టుకొని, పరిస్థితిని విషపూ రితం చేశాయి.

ప్రతీ అంశానికీ రెండో కో ణం అంటూ ఒకటి వుంటుంది, ఉండాలి కూడా.  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం గా ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం  చేసిన క్రమంలోనే భారత్ విశాల హృదయంతో కశ్మీర్ ప్రజల మనసును గెలుచు కునే ప్రక్రియను మరింత ఆత్మీయంగా, విస్తృతంగా కొనసాగించవలసి ఉంది. మన ప్రధాని నరేంద్ర మోదీ దీనిని మరొక బృహత్ కార్యం వలె భావించి చేపట్టగలిగితే బావుంటుంది.

చిత్తశుద్ధితో అను కుంటే ఆయన దీనిని చక్కగా ఉపయోగించగలరు కూడా. అయితే, దీని సాధ్యాసా ధ్యాలు ఎలా ఉన్నా ప్రజల దృక్కోణంలోంచి చూసినప్పుడు ఇందులో అవాంఛ నీయత, అసంబద్ధత ఏమీ ఉండదు. జమ్ముకశ్మీర్ ప్రజల హృదయాలను గెలుచుకోవడం కోసం పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ వర్గాల వారూ గత ఎంతో కాలంగా ఉత్సుకతతో ఉంటున్నారన్నది వాస్తవం. నిజానికి కూడా అక్కడి అత్యధిక ప్రజలు భారత్‌ను అభిమానిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

పీవోకే ప్రజల్లోనూ భారతీయ బంధం

రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వెలిబుచ్చిన ఒక అభిప్రాయం ఈ దృ ష్టా గమనించదగ్గది కూడా. “పీవోకే ప్రజ లు కూడా మన భారతీయులే. ఆనాడు భౌగోళికంగా విడిపోయినా మళ్లీ ఏదో ఒకనాటికి వాళ్ళు మనతో తప్పక కలుస్తారు” అని హోం మంత్రి పేర్కొనడం ఆహ్వానించదగ్గ పరిణామంగానే చూడాలి. ఉగ్రవా దంపై భారత్ తన వ్యూహాన్ని మార్చిందని, పాకిస్థాన్‌తో చర్చలు ఉగ్రవాదం, పీవోకే గురించే ఉంటాయని ఆయన చెప్పారు.

మే 29న న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ (కాన్షిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) వార్షి క వ్యాపార సదస్సు 2025 ప్రారంభ స మావేశంలో ఆయన ప్రసంగిస్తూ పై అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. “పీవోకే ప్రజలు మన సోదరులే. వారు మన దేశానికి సం బంధించిన వారే. అక్కడ చాలామంది భా రతదేశంతో బంధాన్ని అనుభవిస్తున్నారు. తప్పుదారి పట్టిన వాళ్లు కొద్దిమంది మాత్ర మే.

భౌగోళికంగా, రాజకీయంగా ఈరోజు మన నుంచి దూరమైన వాళ్లే అయినా, ఒకరోజు తిరిగి భారతదేశ ప్రధాన స్రవంతిలోకి వస్తారన్న నమ్మకం నాకు ఉంది” అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. “మన దేశం ఎప్పుడూ హృదయాలను కలుపు తూ, ప్రేమ, ఐక్యత, సత్య మార్గంలో ముందుకు వెళుతుంది. అదే మార్గంలో, పీవోకే మళ్లీ మనతో చేరే రోజు ఎంతో దూరంలో లేద ని మేము నమ్ముతున్నాం. ఆ రోజు వారు ‘నేను భారతీయుడిని... తిరిగి వచ్చాను” అని సగర్వంగా చెప్పుకొనే రోజు రాగలదు” అని ఆయనన్నారు.

ఒక్క పీవోకే మాత్రమే కాదు, అసలు కశ్మీర్‌లోని సాధారణ ప్రజలు కూడా మన వాళ్ళే. వాళ్ళు మాత్రం మన భారతీయులు కాకుండా పోరు. వాళ్లలో ముస్లింలైనా, హిందువులైనా. జమ్ములో హిందువులు, కశ్మీర్‌లో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ సాధారణ జీవన విధానంలో ఎవరికి ఎవరూ పోటీ కాదు, వ్యతిరేకులూ కారు. మతం మాయలో పడిపోయి ఉగ్రవాదులుగా మారినవారు,

ప్రత్యేకించి అటువంటి మనస్తత్వం వున్నవాళ్ళు, ఇంకా వారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్ద తు ఇస్తున్న వారు నిజానికి ఎవరో కొం దరు మాత్రమే వుంటారు. అలాంటి వారిలోని వారే పహల్గాం దారుణానికి ఒడిగ ట్టారన్నది స్పష్టం. మనసుల్లో ఒక వర్గం పట్ల అంత ద్వేషం నింపుకోవడం సాధారణ జనాలకు సాధ్యం కాదు.

అసలు నేరస్థులే టార్గెట్ కావాలి

పహల్గాం నేరస్థులనే కాదు, ఉగ్రదాడులకు పాల్పడే ప్రతీ ఒక్కరినీ సాధారణ స మాజం టార్గెట్‌గా చేసుకోవడంలో తప్పులేదు. భారత్ వంటి ఉగ్రవాద బాధిత దేశా లకు చెందిన ప్రభుత్వాలు అలాంటి వారిని ఖచ్చితంగా వెతికి పట్టుకొనే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. అంతర్జాతీయంగా నూ వారిని పెంచి పోషిస్తున్న నేరానికి పాకిస్థాన్ పాలకులను ఈ విషయమై ఆత్మ సంక్షభంలో పడేలా చేయాలి.

ఆ రకంగా అసలైన పాత్రధారులను, సూత్రధారులను పట్టి అంతర్జాతీయ చట్టాల ముందు నిలబెట్టి, ఆ ప్రకారం శిక్షించిన్నప్పుడే ‘ఆపరేషన్ సిందూర్’ అంతిమ లక్ష్యం నెరవేరి నట్టు అవుతుంది. ఒక సగటు భారతీయ హిందూ మహిళామూర్తికి జరిగిన ఘోర అవమానానికి, ఎదురైన సవాలుకు దీటైన సమాధానం ఈ రకంగా ఇవ్వగలగాలి. 

భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదుల నివాస ప్రాంతాలను నాశనం చేయగలిగినప్పటికీ అసలు సూత్రధారులు, పాత్రధారులు వేరే ఉండటమేకాక అంతకంటే ముందే తప్పించుకొని ఉంటారన్న వార్తలలో వాస్తవం లేకపోలేదు. ఇదే తరుణంలో జమ్మూకశ్మీర్ మంత్రివర్గ స మావేశం పహల్గామ్‌లో జరగడం, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక నెల క్రితం ఉగ్రవాదుల చేతుల్లో అమాయక పర్యాటకుల రక్తంతో తడిసిన గ్రామ పరిసరాలలో జరిపిన ‘సైకిల్ యాత్ర’ ఒక రకంగా బాధితుల పక్షాన సంఘీభావం ప్రకటించిన ట్లుగానే భావించాలి.

ఆయన వెలిబుచ్చిన ఈ ప్రతీకాత్మకతకు వాస్తవానికి కంటికి కనిపించే దానికంటే కూడా ఎక్కువ అర్థం తీసుకోవలసి ఉంది. ఆ రాష్ట్రంలో పర్యాటకాన్ని, ప్రజా జీవనాన్ని సంఘర్షణ రహి తంగా మార్చాలన్న ఆయన పిలుపు అభినందనీయం. దీర్ఘకాలంగా ఉగ్రవాదులకు పరోక్ష లేదా ప్రత్యక్ష నిలయంగా ఉన్న ఆ ప్రాంతంలో సాధారణ స్థితి ఏర్పడటానికి ఒక శాంతిమార్గాన్ని చూపేదిగా సీఎం చొరవను భావించవలసి ఉంది.

ప్రభుత్వమే ముందుకు రావాలి

సుదీర్ఘకాల ఈ రాజకీయ సమస్యకు రాజకీయ పరిష్కారం లభించని నేపథ్యం లో ఏం చేయాలన్నది సంక్లిష్ట ప్రశ్న. స్వా తంత్య్రం సిద్ధించిన నాటినుంచీ నేటివర కూ పలువురు పాకిస్థాన్ పాలకులు, ఆర్మీ అధికారులు, సంయుక్తంగానూ కలిసి ఇస్తు న్న ప్రోత్సాహం బలోపేతమవుతున్న ఉగ్రవాద వ్యవస్థ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నది. సిమ్లా ఒప్పందం ఉన్నప్పటికీ వారి కుట్రలు కశ్మీర్ ఆర్థిక వెన్నెముకను విచ్ఛిన్నం చేస్తూనే వున్నాయి.

తాము ఆక్రమించిన కశ్మీర్‌లోని అమాయకులైన, సాధారణ ప్రజలను రక్షించవలసిన వారే అంతకంతకూ వారిని పేదరికంలోకి, అభివృద్ధి నిరోధక కూపంలోకి నెట్టి వేస్తున్నా రు. రాష్ట్రాన్ని అంతకంతకూ వెనుకబడేలా చేయడానికి ఈ సమస్య  శక్తివంతమైన సాధనం వలె మారడం దురదృష్టకరం.

భయంకరమైన పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి లో ఎక్కువమంది భారత పర్యాటకులు ఉ న్నారు. ఒకవైపు దుఃఖం, మరోవైపు కో పం. ఈ రెండు భావోద్వేగాల మధ్య భారతదేశం కశ్మీరీ ప్రజలను అక్కున చేర్చుకోవ డం సాధ్యమా! అంటే, ఇలాంటి వివేకవంతమైన, విశాల దృక్పథం భారతీయులకు సనాతన కాలం నుంచీ వారసత్వంగా వస్తున్నది.

ఉగ్రవాదులు అమాయకులైన ప్రజ లను అడ్డం పెట్టుకొని వారు నమ్మిన మూ ర్ఖ, అజ్ఞానపూరిత లక్ష్యాల కోసం దుర్మార్గాలకు తెగబడుతుంటారు. ఇదే సమయం లో జమ్ముకశ్మీర్ ప్రజలు భారత జాతీయతా భావం నుంచి దూరమవుతున్నా మేమో అన్న భావనకు లోనవకుండా చూసుకోవాల్సి ఉంది. రానురాను తీవ్రమవుతున్న వారిలోని ఈ పరాయీకరణను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి.

పహల్గాం దుర్ఘటన తర్వాత కశ్మీర్‌లోనే అక్కడి సాధారణ ప్రజలు ఉగ్రవాదాన్ని తీ వ్రంగా ఖండించారు. పలువురు స్థానిక నివాసితులు బాధితులకు సహాయం చే యడంలో పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. హిందూత్వ ఆధారిత భద్రతా చర్యలు, మితిమీరిన సైనికీకరణ, కశ్మీర్ భూమిపై నియంత్రణ వంటి వాటినుంచి సయోధ్య, సహకారం వైపు వ్యూహాత్మక మలుపును వారు ఆశిస్తున్నారు. ఇటువంటి ఆశావహ చర్యలు న్యూఢిల్లీ కశ్మీర్ విధానాన్ని పునర్నిర్వచిస్తాయని చెప్పాలి. ఈ రకంగా కశ్మీర్, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలమధ్య మరింత నిర్మాణా త్మక సంబంధానికి పునాది వేయగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.