5 September, 2026 | 7:03 AM

సైన్యంలో తెలుగోడి సత్త

05-09-2026 | 05:45am

కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి :

  1. శౌర్య పరాక్రమాలు, సేవా భావనల వారసత్వం
  2. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అనేక తరాల త్యాగనిరతి
  3. భారత సాయుధ దళాల్లో తెలుగు వారి సేవలు చరిత్రలో గర్వించదగ్గ అధ్యాయం

భారత సైనిక దళాల్లో(Indian Army) తెలుగువారి పాత్ర గర్వించదగినది. అయితే ఈ విషయంపై చరిత్రలో మనవారి సత్తాపై సరైన వెలుగు ప్రసరించలేదు. తరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(Andhra Pradesh, Telangana)కు చెందిన అనేక మంది యువతీయువకులు సైన్యం(Youth Army)లో, నావికాదళం(Navy), వైమానిక దళా(Air Force)ల్లో పనిచేశారు. ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, కావాల్సిన వృత్తిధర్మం వారికి మెండుగా ఉన్నాయి. 1971లో జరిగిన ఇండో-పాకిస్థాన్ యుద్ధం, కార్గిల్ యుద్ధభూమి నుంచి గాల్వాన్, ఐక్యరాజ్యసమితి మిషన్ల వరకు, ఆంధ్రప్రదేశ్, తెలంగా ణకు చెందిన సైనికులు, సైనికాధికారులు ధైర్యసాహసాలు, త్యాగాలు గర్వించదగిన సంప్రదాయాన్ని నిలబెట్టారు.

ఇది సైనిక శ్రేణుల నుంచి అత్యున్నత స్థాయి కమాండ్ వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ అందించిన అత్యుత్తమ సైనిక నాయకులలో ఒకరైన జనరల్ కేవీ కృష్ణారావు, 11వ ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. 1971 ఇండో--పాకిస్థాన్ యుద్ధ సమయంలో, ఆయన కమాండ్‌లోని 8వ మౌంటెన్ డివిజన్ సిల్లెట్ ప్రాంతాన్ని స్వాధీ నం చేసుకుని, బంగ్లాదేశ్ విమోచనకు ము ఖ్యమైన సహకారం అందించింది. హైదరాబాద్‌లో జన్మించిన.. 1978 నుంచి 1981 వరకు భారత వైమానిక దళానికి అధిపతిగా పనిచేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఐహెచ్ లతీ ఫ్, ఈ ప్రాంతానికి సంబంధించిన మరో విశిష్ట నాయకత్వ సంప్రదాయానికి ప్రతీక. 

1999 కార్గిల్ యుద్ధం అనేక మంది సైనికుల శౌర్యాన్ని, త్యాగాలను జాతీయ దృష్టికి తీసుకువచ్చింది. హైదరాబాద్ నివాసి అయి న 2 రాజపుతానా రైఫిల్స్‌కు చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య, తీవ్రమైన ఫిరంగి, మెషిన్-గన్ కాల్పుల మధ్య, పటిష్టంగా బలపరి చిన శత్రు స్థావరంపైకి తన కంపెనీకి నాయకత్వం వహించారు. తీవ్రంగా గాయపడినప్ప టికీ, ఆయన ముందుండి నాయకత్వం వ హించి, తన ప్రాణాలను అర్పించారు. ఆయనకు మరణానంతరం మహావీర చక్ర పుర స్కారం ప్రదానం చేశారు.

ఆపరేషన్ విజయ్ సమయంలో తమ ప్రాణాలను అర్పించిన ఈ ప్రాంతానికి చెందిన ధైర్యవంతులైన సైనికులలో, సూర్యాపేటకు చెందిన 315 ఫీల్ రెజిమెంట్‌లో పనిచేస్తున్న లాన్స్ నాయక్, పోలోజు గోపయ్యచారి, బోలారంకు చెందిన 8 మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేస్తున్న లాన్స్ నాయక్ ఎంవై రామచందర్ ఉన్నారు. ద్రాస్ సెక్టార్‌లో ఒక ప్రత్యక్ష కార్యనిర్వహణ మిషన్‌లో ఆయన హెలికాఫ్టర్‌పై దాడి జరగడం తో భారత వైమానిక దళానికి చెందిన సార్జెం ట్ పీవీఎన్ రవిప్రసాద్ మరణించారు. ఆ యనకు మరణానంతరం వాయుసేన పతకాన్ని ప్రదానం చేశారు.

2020లో గల్వాన్ యుద్ధసమయంలో నూ ఆ సంప్రదాయం కొనసాగింది. సూర్యాపేటకు చెందిన 16 బీహార్ రెజిమెంట్ క మాండింగ్ ఆఫీసర్ కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తన సైనికులను ముందుండి నడిపించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ, ఆయన భారత సైనికులను వెనక్కి నెట్టే ప్రయత్నాన్ని ప్రతిఘటించి, తన ప్రాణాలను అర్పించారు. ఆయ నకు మరణానంతరం లభించిన మహావీర చక్ర కేవలం ఆయన కుటుంబానికి, రెజిమెంట్‌కు మాత్రమే కాకుండా, తెలంగాణ, భారత దేశ సామూహిక స్మృతికి కూడా చెందుతుంది.

ఈ ప్రసిద్ధి తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది.. అంతగా గుర్తింపులేని సైనికులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నావికు లు, వైమానికులకు కూడా లభిస్తుంది. వారి కుటుంబాలు సుదీర్ఘ ఎడబాటు, అనిశ్చితి, సాదకబాధకాల మధ్య కూడా సైనిక సంస్కృతిని కొనసాగించాయి. వారు ప్రజల దృష్టికి దూరంగా ఉంటూ, మానవతా సహాయం, విపత్తులు, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ వంటి రంగాలలో కూడా విశిష్టంగా సేవలందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, దుం డిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హకీంపేట్, గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్, విశా ఖపట్నంలోని తూర్పు నావికా దళం వంటివి భారతదేశ సైనిక సంస్థలతో ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని ప్రతిబింబిస్తాయి.

యూనిఫాం అపారమైన బాధ్యత

భారత వైమానిక దళ మాజీ ఫైటర్ పైలట్‌గా, యూనిఫాం అనేది ఒక విశేషాధికా రం, అపారమైన బాధ్యత అని నాకు తెలు సు. మన సరిహద్దులను కాపాడుతున్న ప్రతి వ్యక్తి వెనుక, ఆ భారాన్ని నిశ్శబ్దంగా పంచుకునే ఒక కుటుంబం ఉంటుంది. అందువల్ల, తెలుగు సైనిక వీరులను స్మరించుకోవడం కేవలం లాంఛనప్రాయమైన నివాళి కాకూడ దు.  వారి కథలు మన తరగతి గదులలోకి, విద్యాసంస్థలలోకి, సామూహిక చైతన్యంలోకి ప్రవేశించి, యువతను క్రమశిక్షణ, ధై ర్యం, స్వార్థం కన్నా సేవకే ప్రాధాన్యతనిచ్చేలా ప్రేరేపించాలి.

 వ్యాసకర్త (నీటిపారుదల, 

పౌర సరఫరాల శాఖ మంత్రి, 

భారత వైమానిక దళ మాజీ ఫైటర్ పైలట్)

మరిన్ని వార్తలు