01-06-2025 12:18:46 AM
- 8న గిరిజన హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ కార్యక్రమం
- నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి
ఖైరతాబాద్; మే 31 (విజయ క్రాంతి) { సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్ పిఎస్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.జూన్ 8న గిరిజన హక్కుల సాధనకై రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యాచరణ సభను ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ ఎదురుగా ఐఎంఏ హాల్ జరుపుతున్నట్లు తెలిపారు.
ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, జాతీయ జనరల్ సెక్రెటరీ నరేందర్ పవార్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, కృష్ణా నాయక్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పాండు నాయక్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు బానోత్ శివాజీ నాయక్ లు ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడు తూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలను పొందుపరిచి గిరిజన ఓట్లను దండుకొని గెలిచిన అనంతరం వాటిని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. గిరిజన హక్కులను కాలరాస్తూ ఏకపక్ష నిర్ణయాలతో గిరిజన ప్రజల మనో భావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. గిరిజన హక్కులను సాధించుకునేందుకు తాము ఎంతకైనా సిద్ధం అని తెలిపేందుకు ఈ నెల 8న చలో ఖమ్మం కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు కొంతమంది లంబాడి హక్కుల పోరాట సమితి పేరుతో ఎనిమిదవ తేదీన గాంధీభవన్ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారని ఆ సంఘానికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావున గిరిజనులు 8వ తేదీన ఖమ్మంలో జరిగే సభకు విచ్చేసి సభను చేయాల్సిందిగా కోరారు. గోర్ గోలి భాషను అధికారికంగా గుర్తించి,ఎస్టీల 10 శాతం రిజర్వేషన్ ను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు.
శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఐచ్చిక సెలవుదినంగా కాకుండా సాధా రణ సెలవుదినంగా ప్రకటించాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంగారాభేరి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సూర్య నాయక్, విద్యార్థి విభాగం ఓయూ అధ్యక్షులు బి. ప్రసాద్ నాయక్, విద్యార్థి విభాగం & ఓయూ జేఏసీ నాయకులు వంకుడోత్ కళ్యాణ్ పవార్, చరణ్ పవార్, కాట్రవత్ రాజు నాయక్, గణేష్ నాయక్, ఖమ్మం జిల్లా నాయకులు బానోత్ నందు, మహబూబ్నగర్ జిల్లా నాయకులు శివ నాయక్, సురేష్ నాయక్ , హేమంత్ నాయక్ పాల్గొన్నారు.