01-06-2025 12:18:49 AM
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): మలక్పేట్ డ్రైనేజీ లీకేజీ మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి శనివారం ఆయన మలక్పేట్ ఆర్యూబీ వద్ద డ్రైనేజీ లీకేజీని పరిశీలించారు. లీకేజీ నేపథ్యంలో వరదనీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అంతకముందు కమిషనర్ ఆర్వీ కర్ణన్ కూకట్పల్లి జోనల్ కమిషనర్తో కలిసి కుత్బుల్లాపూర్ సర్కిల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఫాక్స్ చెరువును, జాతీయ రహదారి 44 నుంచి చింతల్ వరకు చేపట్టే రోడ్డు వెడల్పు పనులను, పైప్లైన్ రోడ్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదిద స్థలాన్ని పరిశీలించారు.
డ్రైనేజీ డైవర్షన్ పొడిగింపు పైప్లైన్ పనులు, రోడ్డు వెడల్పు పనులు చేపట్టేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, ఎస్ఎస్డీపీ సీఈ కోటేశ్వరరావు, జోనల్ ఎస్ఈ చిన్నారెడ్డి, లేక్స్ ఈఈ నారాయణ, డీసీ తదితరులు పాల్గొన్నారు.