13-06-2025 11:57:13 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఉన్న బ్లూ బెల్స్ హై స్కూల్ విద్యార్థులు రీ వెరిఫికేషన్ ఫలితాలలో అదిరిపోయే ప్రతిభను చూపారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని పుప్పాల నిశ్విక గణితంలో మొదటగా ప్రకటించిన 94 మార్కులకు బదులుగా, రీ వెరిఫికేషన్లో పూర్తి 100 మార్కులు సాధించడంతో, ఆమె మొత్తం మార్కులు 578కి చేరాయి. ఈ విజయంతో నిశ్విక ఈ ఏడాది ఎస్.ఎస్.సి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి, బ్లూ బెల్స్ పాఠశాల ఖ్యాతిని మరింతగా పెంచింది. పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ జంగా సునీత మనోహర్ రెడ్డి నిశ్వికను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తు కోసం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.