2 May, 2026 | 1:10 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

వైభవంగా ది మాస్టర్ మైండ్ స్కూల్ వార్షికోత్సవం

16-03-2026 12:00 AM

అట్టహాసంగా సాగిన సాంస్కృతిక వేడుకలు

జగదేవపూర్, మార్చి15: జగదేవపూర్ మండల కేంద్రంలోని ది మాస్టర్ మైండ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పాఠశాల చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి,కరస్పాండెంట్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు అ ట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి సైదులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో ముఖ్య అతిథిలు పాఠశాల యాజమాన్యం కలిసి జ్యోతి ప్ర జ్వలన చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

వీరితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజా ప్రతినిధులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశా ల యాజమాన్యం ఎంఈఓ సైదులుని, సర్పంచులను మెమెంటోలు, శాలువాలతో ఘనంగా స న్మానించారు.హోరెత్తించే డీజే పాటలకు విద్యార్థులు వేసిన స్టెప్పులతో హాల్ అంతా సందడిగా మారింది.హుషారైన సినిమా పాటలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే జానపద గీతాలకు చేసిన వివిధ రకాల ఈవెంట్స్, నాటికల ద్వారా విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకత ను చాటుతూ అందరినీ ఆకట్టుకున్నారు.

ముఖ్య అతిథి ఎంఈఓ సైదులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను,అద్భుతమైన వేదికను కల్పించిన చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి, కరస్పాండెంట్ కిరణ్ రెడ్డి లను ఆయన ప్రత్యేకంగా అ భినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని, విద్యార్థుల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు.