15-11-2025 01:07:51 AM
-స్థానిక, జీహెచ్ఎంసీలోనూ సత్తా చాటుతాం
-కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించి, రికార్డు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించిన తీరు చరిత్రాత్మకమని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేశ్ కొనియాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి 24,729 భారీ మెజార్జీ సాధించిన సందర్భంగా, ఈ విజయంలో సోమాజిగూడ డివిజన్ ఇంచార్జీగా అత్యధిక లీడ్ అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును శుక్రవారం సచివాలయంలో కలిసి మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం స్ఫూర్తితో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తంచేశారు.