17-12-2025 04:42:02 PM
చెక్ డ్యాం కొట్టుకుపోయిందా.. ధ్వంసం చేశారా!
మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ శివారులో ఉన్న మానేరులోని చెక్ డ్యాం కొట్టుకుపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. అడవి సోమన్ పల్లి మానేరులో గత ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. ఈ చెక్ డ్యాంతో రైతులకు రెండు పంటలకు నీరు నిల్వ ఉండడానికి నిర్మించారు. బుధవారం ఉదయం చెక్ డ్యాం నీటిలో కొట్టుకుపోయి, నీరు కిందికి పోతుండడంతో స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు.
కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాం ఇలా వరదకు కొట్టుకపోవడంతో ఆ నిధులు నీళ్లపాలు అయ్యాయని స్థానికుల తెలిపారు. అసలు ఈ చెక్ డ్యాం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందా లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారా అని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని చెక్ డ్యాం ఎలా కొట్టుకుపోయిందని విచారణ చేపట్టుతున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా తర్వాత చెప్పుదామని దాటవేశారు.