calender_icon.png 16 June, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి చెరువు పూడిక తీయుటలో అవినీతి జరగలేదు..

15-06-2025 10:37:55 PM

బిఆర్ఎస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు..

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy), కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రం రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ... దొంగలే దొంగ దొంగ అంటు, ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని వాళ్లే అంటూ, నిజమైన దయ్యాలు ఎవరో ప్రజలకు ప్రజలకు తెలుసని, కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా 50 కోట్ల నిధులను విడుదల చేశారు. భద్రకాళి అమ్మవారికి అన్ని చేశాము అనే నేతలారా మీ హయాంలో భద్రకాళి అమ్మవారికి ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా… మీ హయాంలో జరిగిన పాపాలకు నేడు మేము శుద్ధి చేస్తున్నాం. కేటిఆర్ నయీమ్ నగర్ బ్రిడ్జి మీద వరద బాధితులకు ఇస్తానన్న 10 వేలు ఎక్కడ? జైలుకు పోయే ముందు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. 

అమరవీరుల ఆత్మశోభిస్తుందని, నిజమైన ఉద్యమకారులు నేడు మా ప్రజా ప్రభుత్వ హయాంలో న్యాయం జరిగిందని మా పార్టీలోకి వస్తున్నారు. అభివృద్ధికి వేసిన ప్రతి టెండర్ పక్రియ తెరచిన పుస్తకమే.. మీ హయాంలో 25 % వసూలు చేసిన మీరు, నేడు మా ప్రభుత్వాన్ని నిందించడం అంటే 32 కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న.. ముఖ్యమంత్రి ని విమర్శించడమే తప్ప ప్రజలకు మీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పలేదు. అర్హత మాత్రమే మా ప్రభుత్వంలో ప్రామాణికం. చెరువు అభివృద్ధిలో ఆన్లైన్ ద్వారా ఈ టెండర్ విధానం ద్వారానే ఎంపిక జరిగింది. వరంగల్ అభివృద్ధిలో మీ పాత్ర ఏంటో కేటిఆర్ నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా!! భద్రకాళి అమ్మవారి చెరువు మట్టి తరలింపులో పూర్తిస్థాయి ఉచితంగా అందుబాటులో ఉన్న రైతులకు, స్మశానవాటికలకు అందజేస్తున్నాం.

చెరువు గతంలో ఉన్న విస్తీర్ణంతో పనులు జరుగుతున్నాయి తప్ప ఎటువంటి స్థాన చలనం జరగలేదు. గతంలో చెరువులో ఉన్న చిన్న చిన్న గుట్టల ప్రాంతాలల్లో మట్టి పోసి ఐలాండ్ లాగా మారుస్తున్నాం. మీ 10 పదేళ్ల హయాంలో బొంది వాగు పట్టించుకోకపోతే సుమారు 160 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. వడ్డేపల్లి రైతులను భూములను లాక్కోవాలని చేసిన నువ్వు ఈ రోజు మా గురించి మాట్లాడే హక్కు లేదు. ఈ కార్యక్రమంలో  తోట వెంకటేశ్వర్లు, బట్టి శ్రీనివాస్, బంక సరళ సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఎనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకొంటి పున్నం చందర్, రవి కిరణ్, కాంగ్రెస్ నాయకులు మండల సమ్మయ్య, మట్టపల్లి కమల్ తదితరులు పాల్గొన్నారు.