22-06-2025 12:00:00 AM
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. జీర్ణకోవ వ్యవస్థను సజావుగా పనిచేయిస్తుంది. ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అయితే మధుమేహం ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లో ఎండుద్రాక్ష తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- ఎండుద్రాక్షలో నీటిలో కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కొవ్వును కరిగించే లెప్టిన్ హార్మోన్ మోతాదు పెరిగేలా చేస్తుంది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
- ఎండుద్రాక్షలో రిస్వెరటాల్ రసాయనం ఉంటుంది. ఇది కణాల్లో వాపు, రక్తనాళాల్లో పూడికలను తొలగిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.
- యాంటీ సెప్టిక్ గుణాలు నోటి పూట, చిగుళ్లవాపు తగ్గటానికి తోడ్పడతాయి. రోజుకు ఐదారు ఎండుద్రాక్షలను నములుతుంటే దుర్వాసన, నోట్లో బ్యాక్టీరియా వృద్ధి తగ్గుతుంది.
- మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్ వంటివి ఉండటం వల్ల ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముక సాంద్రతను మెరుగు పరుస్తుంది. కీళ్లవాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.