01-06-2025 12:00:00 AM
చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీతో బిస్కెట్ తింటారు. టీతో బిస్కెట్ తినడం ఒక సాధారణ అలవాటు. కొంతమందికి అలా తినడం వల్ల కొద్దిగా తృప్తి కలుగుతుంది. టీతో బిస్కెట్ తినడం వల్ల టీ రుచి బాగుంటుందని అంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టీతో బిస్కెట్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బిస్కట్లలో క్యాలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఉదయాన్నే టీతో పాటు బిస్కెట్లను తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
బిస్కెట్లలో అధికంగా చక్కెర ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహానికి దారితీస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్ తినకపోవడం మంచిది.
బిస్కట్లలో అధిక కొవ్వులు ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల బీపీ సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయాన్నే టీతో పాటు బిస్కెట్లు తినకండి.
బిస్కెట్లు జీర్ణం కావడానికి ఎక్కువ సయమం పడుతుంది. మీరు ఉదయాన్నే టీతో వాటిని కలిపి తీసుకుంటే ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
బిస్కెట్లు హార్మోన్ల పనితీరును కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి, ఉదయాన్నే వీటిని తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.