16 May, 2026 | 12:13 AM

ఆర్‌బీఐ గుర్తించింది ఇలాగే

16-02-2025 12:14 AM

ముంబై, ఫిబ్రవరి 15: ముంబైలోని న్యూ ఇండియా బ్యాంక్‌లో రూ. 122 కోట్ల మేర మోసం జరిగింది. ఈ మోసాన్ని ఆర్‌బీఐ ఎలా గుర్తించిందో బ్యాంకు సీనియర్ ఉద్యోగి తెలిపిన స్టేట్మెంట్‌లో ఉన్నా యి.

‘రొటీన్ ఆడిట్‌లో భాగంగా ఆర్‌బీఐ అధికారులు తనిఖీలకు వచ్చా రు. వారికి రూ. 122 కోట్ల మోసం విషయం తెలిసింది. ఫిబ్రవరి 12న ఆర్‌బీఐ అధికారులు ఈ తనిఖీ నిర్వహించారు.’

అని తన స్టేట్మెంట్‌లో వివరించారు. పోలీసులు ఇప్పటికే బ్యాంకుకు చెందిన పెద్ద అధికారులను అరెస్ట్ చేశారు. స్కామ్ గురించి అసలు నిజాలు బయటపెట్టే పనిలో ఉన్నారు.