1 July, 2026 | 8:11 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

మియాపూర్‌లో లారీ బీభత్సం

08-04-2025 10:27 AM

మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం

డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ

లారీ ఢీకొని ముగ్గురు ట్రాఫిక్ పోలీసులకు తీవ్రగాయాలు

చికిత్స పొందుతూ హోంగార్డ్ సింహాచలం మృతి

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్(Miyapur Metro Station) వద్ద మంగళవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. లారీ ఢీకొని ముగ్గురు ట్రాఫిక్ పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హోంగార్డు సింహాచలం(Home Guard Simhachalam) మృతి చెందాడు. మృతుడు సింహాలచం స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు రాజ్యవర్ధన్, విజేందర్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.