16 April, 2026 | 11:57 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నేడు తుది విడత పంచాయతీ పోరు

17-12-2025 12:25 AM
  1.   3,752 సర్పంచ్, 28,410 వార్డులకు పోలింగ్
  2. నోటిఫై చేసిన వాటిలో 4,159 గ్రామాలు, 36,452 వార్డులు
  3.   394 సర్పంచ్, 7,908 వార్డులు ఏకగ్రీవం
  4. స్టేతో రెండు గ్రామాలు, 18 వార్డులకు ఎన్నిక నిలిపివేత

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో తుది విడత పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉద యం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానున్నది. ఈ మూడో విడత ఎన్నికలకు 4,159 గ్రామ పంచాయతీలను నోటిఫై చేయగా 11 చోట్ల సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు 116 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ వేసిన గ్రామాల్లోనూ రెండు సర్పంచ్ స్థానా లు, 18 వార్డులకు వివిధ కారణాలతో స్టే ఉం డటంతో ఎన్నికలు వాయిదా వేశారు. ఈ తుది విడతలో 53,06,401 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26,01,861, మహిళలు 27,04,394, ఇతరులు 140 మంది ఓటర్లు ఉన్నారు.