రేపు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
01-09-2024 02:32 PM
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయని, అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. తీవ్రమైన వరదలు సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడ సింగ్నగర్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భారీ వర్షాలతో సింగ్నగర్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి.






