calender_icon.png 7 June, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర కమాండర్లు మృతి

07-06-2025 09:42:17 AM

బీజాపూర్ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్(National Park) ప్రాంతంలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నుండి కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సీనియర్ మావోయిస్టు నాయకులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard), కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(Commando Battalion for Resolute Action), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Special Task Force)లతో కూడిన సంయుక్త బృందం గురువారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

ప్రస్తుతం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు(Maoist Top Commanders) మరణించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ పార్క్ లో అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు గత మూడు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 3 రోజులుగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం ఎదురుకాల్పుల్లో ఇప్పటికే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, రివల్యూషనరీ పొలిటికల్ స్కూల్ ఇన్‌ఛార్జ్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్  భద్రతా దళాలు హతమార్చాయి