21-02-2026 08:00:56 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం పై విశ్వాసముంచి తమను గెలిపించిన ప్రజలకు ఏ అవసరం వచ్చిన కాలానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. శనివారం శ్రీనగర్ కాలనీలో పర్యటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని కాలనీ నాయకులు సన్మానం చేశారు. కాలనీ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ సభ్యులు గణేష్ రాజేష్ నవీన్ నరేష్ ప్రసాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.