20 August, 2026 | 3:48 PM

అధునాతన సాంకేతికతపై గీతం అధ్యాపకులకు శిక్షణ

20-08-2026 03:16 PM

మ్యాట్ ల్యాబ్ ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పై కార్యశాల

పటాన్ చెరు, ఆగస్టు 20: వేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని, బోధన-శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు గాను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ అధ్యాపకులకు మ్యాట్ ల్యాబ్ ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పై మూడు రోజుల ప్రత్యేక కార్యశాలను ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించారు. ఈ వర్క్ షాపును ఆర్కాన్స్ ఇన్, మ్యాథ్ వర్క్స్ ల సంయుక్త సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ (జీఎస్సీఈ)లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం నిర్వహించింది.

ఈ కార్యశాలను, మ్యాట్ ల్యాబ్ ఆధారిత మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డీప్ లెర్నింగ్ (డీఎల్)లో అధ్యాపకులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడానికి రూపొందించారు. ముఖ్యంగా, గణన భావనలను సమకాలీన ఇంజనీరింగ్, పరిశోధన సమస్యలకు పరిష్కారాలుగా మార్చడంపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక భావనలను ఆచరణాత్మక అమలుతో కలిపి, డేటా-ఆధారిత పద్ధతులను విభిన్న సాంకేతిక రంగాలలో ఎలా అన్వయించవచ్చో అన్వేషించడానికి గీతం అధ్యాపకులకు వీలు కల్పించారు.  మ్యాథ్ వర్క్స్ కు చెందిన సీనియర్ ట్రైనింగ్ ఇంజనీర్ డాక్టర్ శుభోబ్రత భట్టాచార్య ఈ కార్యశాలలో ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించారు. ప్రత్యేక సాంకేతిక కార్యక్రమాలు, ముఖాముఖి ద్వారా, ఆయన ఇందులో పాల్గొన్న వారికి కీలకమైన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ భావనలను, అలాగే మ్యాట్ ల్యాబ్ టూల్స్, ఫ్రేమ్ వర్కులను ఉపయోగించి వాటి అమలును పరిచయం చేశారు. ఈ సెషన్లు సమకాలీన గణన విధానాలు, ఇంజనీరింగ్, పరిశోధన, సమస్య-పరిష్కారంలో వాటి వినియోగంపై విలువైన అంతర్దృష్టులను అందించాయి.

వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధ్యాపక బృందం ఈ కార్యశాలలో చురుకుగా పాల్గొని, మ్యాట్ ల్యాబ్, ఫ్రేమ్ వర్కులను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ భావనల అభివృద్ధి, అమలు చేయడంలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. ముఖాముఖితో ఆచరణాత్మకంగా సాగిన ఈ శిక్షణలో పాల్గొన్నవారికి అంతర్లీన భావనలు, వాటి ఆచరణాత్మక అనువర్తనాలు.. రెండింటిపై అవగాహనను పటిష్టం చేసుకోవడానికి సహాయపడ్డాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖాముఖి స్వభావం, పరిశ్రమకు సంబంధించిన టూల్స్, వర్క్ ఫ్లోలను అన్వేషించే అవకాశాన్ని కూడా కల్పించింది. తద్వారా, ఈ సాంకేతికతలను బోధన, పరిశోధన, ఇంజనీరింగ్ అనువర్తనాలకు వర్తింపజేయడంలో ఇందులో పాల్గొన్న వారి విశ్వాసాన్ని పెంచింది. ఈ కార్యశాలను జీఎస్సీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. ప్రశాంత రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహించారు. డాక్టర్ మాధవి తాతినేని, డాక్టర్ ఎం. మరియదాసు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచి, విజయవంతంగా నిర్వహించేలా చూశారు.