29 April, 2026 | 9:51 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

09-03-2026 09:33 PM

ఇంచార్జ్ ఎంపీడీవో ఖాజా అజాజుద్దీన్

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని గ్రామ పంచాయతీలకు చెందిన రెండో బ్యాచ్ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి ఖాజా అజాజుద్దీన్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీల పనితీరు మెరుగుపడేలా వార్డు సభ్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాల్లో వార్డు సభ్యులు ప్రజలకు దగ్గరగా ఉండి సమ స్యలను గుర్తించి పరిష్కరించే బాధ్యత వహించాలని సూచిం చారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థులకు చేరేలా సమర్థ వంతంగా పనిచేయాలని తెలిపారు.శిక్షణలో గ్రామాభి వృద్ధి, పంచాయతీ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  మండలంలోని పలు గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు పాల్గొన్నారు.