17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

దేశీదారు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్..

22-04-2025 09:26 PM

ఇచ్చోడ (విజయక్రాంతి): మహారాష్ట్రకు చెందిన దేశీదారు లిక్కర్ ను ఆమ్ముతున్నట్టు కచ్చితమైన సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జుల్ఫీకర్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం... సొనల మండలంలోని గుర్రల తండా గ్రామంలో కొందరు వ్యక్తులు మహారాష్ట్ర నుండి అక్రమంగా దేశిదారులు తరలించి విక్రయిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం దాడి చేయగా చౌహాన్ సంజీవ్, చౌహాన్ కల్పన అనే ఇద్దరు మహారాష్ట్రకి చెందిన దేశీదారు అమ్ముతుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి సుమారు 105 దేశీదారు బాటిల్స్ స్వాధీనం చేసుకుని, వారిద్దరినీ అరెస్టు చేసినట్టు తెలిపినారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సై విజయలక్ష్మి, సిబ్బంది బాపురావు, కార్తీక్, మౌనిక, అరుణ పాల్గొన్నారు.