4 May, 2026 | 12:23 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత.. గ్రూప్-1 అభ్యర్థులకు బండి సంజయ్‌ మద్దతు

19-10-2024 01:53 PM

హైదరాబాద్: అశోక్ నగర్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్‌సి) గ్రూప్ 1 పరీక్షపై నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో, కేంద్ర రాష్ట్ర మంత్రి, బిజెపి నాయకుడు బండి సంజయ్ కుమార్ శనివారం నాడు నిరసన స్థలాన్ని సందర్శించి ఆశావాదులతో సమావేశమయ్యారు. అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్లిన కేంద్రమంత్రిని గ్రూప్ -1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. అశోక్ నగర్ కు బండి సంజయ్ రాకతో గ్రూప్ వన్ అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. అటు అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మద్దతు పలికారు.  గ్రూప్-1 బాధితులకు న్యాయం చేయాలంటూ  బండి సంజయ్‌ రోడ్డుపై బైఠాయించారు.