11-06-2025 12:26:52 AM
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారికే కేటాయించాలి
- ప్రతినెల చివరి శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి..
- ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
గద్వాల, జూన్ 10 ( విజయక్రాంతి ) : ఎస్సీ,ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతీ నెల చివర పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, భూ సమస్యలు, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితలపై అణిచివేత, అసమానత్వం,అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కమిషన్ నిరంతరం పనిచేస్తోందని చైర్మన్ వెల్లడించారు. జిల్లాలో పెండింగ్ గా ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూ పాలన్నారు.అన్ని రకాల పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించా రు.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనపై నివేదికను కమిషన్కు సమర్పించాలని, ఎవరికీ ఆన్యాయం జరగకూడదని ఆదేశించారు. ఎక్కడైనా ఎస్సీ,ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డి.వి. యం.సి)వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వివిధ సమస్యలపై బాధితుల సమస్యల పరిష్కారంపై వినతి పత్రాలను సేకరించారు.
అంతకు ముందు అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్ రావు,కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ,నీలా దేవి, రాంబాబు నాయక్,రెణికుంట్ల ప్రవీణ్, ఆర్డిఓ అలివేలు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రమేష్ బాబు, డిఎస్పీ మొగలయ్య,జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,కుల సంఘ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన వాటాలు ఖచ్చితంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలి
వనపర్తి టౌన్, జూన్ 10 : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలలో ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన నిధులు, వాటాలు ఖచ్చితంగా వారికే అం దే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. మంగళవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం సభ్యులు వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఐ.డి. ఒ సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ రావుల గిరిధ ర్, జిల్లా అధికారులు, జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో చైర్మన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ జిల్లాలోని ముఖ్యమైన శాఖల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలలో ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా దక్కిందా లేదా అనే వివరాలు ఆరా తీసారు. ప్రతి నెల 30వ తేదీన పౌర హక్కుల దినోత్సవం విధిగా నిర్వహించాలని దాని కి సంబంధించిన ఒక సంవత్సరము ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీనితో పాటు ప్రతి మూ డు నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన విజిలెన్స్ మరి యు మానిటరింగ్ కమిటీ సమావేశం తప్పకుండా నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, కమిషన్ సభ్యులు కె. నీల దేవి, రాంబాబు నా యక్, కే. లక్ష్మీ నారాయణ, జె. శంకర్, ఆర్. ప్రవీణ్, ఈ డి ఎస్సీ కార్పొరేషన్ మల్లికార్జున్, జిల్లా అధికారులు, డీఎస్పీ వెం కటేశ్వరరావు, సి. ఐ లు, ఎస్త్స్ర లు, తహశీల్దార్లు , విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.