11-06-2025 12:27:53 AM
బాపు చూపిన మార్గం అంబేద్కర్ ఆశయాలతో నడుద్దాం
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రంగారెడ్డి జూన్ 10( విజయక్రాంతి ): ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధవ్యూహాలు ప్రదర్శించి పాకి స్తాన్ యుద్ధరంగంలో తోక ముడిచేలా ఎత్తుగడలు వేస్తూ..... యుద్ధరంగంలో ధైర్యంగా ముందడుగు వేస్తే పహల్గాం లో మన దేశ పౌరులను ఉగ్రవాదులు పిట్టల్లా కాల్చి చం పితే వారిని కాపాడలేని దుస్థితిలో మోడీ ఉన్నారన్నారు. ఆపరేషన్ సింధుర్ విషయం లో సైతం ఉగ్రవాదులను శిక్షించడంలో తోక ముడిచారని...
చివరికి యుద్ధాన్ని కూడా అర్ధాంతరంగా ముగింపు పలికి ట్రంప్ కు దాసోహం అయ్యాడని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఇందిరమ్మతో మోడీకి పోలికనా?మోడీ పదవుల కోసం పుట్టిన మనిషి అయితే గాంధీ కుటుం బం... త్యాగాల కోసం పుట్టిందని ఆయన కొనియాడారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భా గంగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టీపీసీ చీఫ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం చెప్పి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈడెన్ గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాల న కొనసాగుతుందని... ఓవైపు మతవిద్వేషాలు రెచ్చగొడుతూ బయటి దేశాలకు ఊడి గం చేస్తున్న మోడీ నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు.
బిజెపి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విన్నుత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు.రాజ్యాంగబద్ధంగా పాలన అం దించేందుకు ప్రజలను చైతన్యం చేసేందుకు జై బాపు,జై భీమ్, జై సంవిద్ కార్యక్రమం పై విస్తృతంగా ప్రచారం చేపడుతున్నట్లు ఆయ న గుర్తు చేశారు. దేశంలో మతం,కులం అనే ప్రతిపాదికన ప్రజలను విభజిస్తూ బిజెపి రాజకీయం చేస్తుందని ఆయన తీవ్ర విమర్శ లు గుప్పించారు.
దేశంలో 400 ఎంపీ స్థానాలు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చాలని కుటిల బుద్ధి కలిగిన వారికి ప్రజలు తమ ఓ టు ద్వారా గుణపాఠం చెప్పారని ఆయన మం డిపడ్డారు. ప్రపంచంలో భారత రాజ్యాంగానికి గొప్ప గౌరవం ఉందని... బిజెపి పాలకులు పార్లమెంట్ నిండు సభలో రాజ్యాంగం... రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా వ్యవరించిన తీరును ప్రజలందరూ గమనించారని చెప్పారు.
దేశ ప్రజలందరికీ సమాన హక్కులు,బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించి ప్రజాస్వామ్యయూతంగా ప్రజలకు పాలన అందించేలా పాలకులు చూడాలని రాజ్యాంగం చెప్పిందన్నారు. ప్ర స్తుతం దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మళ్ళీ మనుస్మూతి ని తీసుకొచ్చి పాలన కొనసాగించేలా బిజెపి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన వి మర్శించారు అహింసనే ఆయుధంగా చేసుకొని దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాం ధీని విమర్శించే స్థాయికి నేడు బిజెపి పార్టీ దిగజారిందని ఆయన చురకలాంటించారు.
దేశ సంపదలో 40% పైగా కార్పొరేట్ కంపెనీలకు దేశ ఆదాయాన్ని దోచిపెట్టి ఈ దేశ మూల వాసులకు కనీస అవసరాలను తీర్చలేని దుస్థితిలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు. పదేళ్ల బిజెపి పాలన లో దేశ ఆర్థిక పరిస్థితి కునారిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ లు ఫెయిలయ్యారని... రాష్ట్రంలో మతవివాదాలు సృష్టించేందుకే తప్ప వారికి పాలనకు వారు పనికిరారన్నారు.
వారిద్దరు రాష్ట్రానికి చేసిన మేలు ఏంటని మంత్రులుగా వారు అనర్హులన్నారు. కాంగ్రెస్ పాలనతోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందుతుందన్నారు. ప్రజాపాలనలను రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన గుర్తు చేశారు .
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచా రం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, నాయకులు తారా నాయక్ జైపాల్ నాయక్ మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.