12-06-2025 02:10:45 PM
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ హయంలో నిర్మించిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు(Kaleshwaram Irrigation Project)పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్కే భవన్ విచారించింది. కేసీఆర్ విచారణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రెండు రోజుల్లో కాళేశ్వరంపై ప్రెస్ మీట్ పెడతానాని తెలిపారు. రేవంత్ చేసిన వ్యాఖ్యాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Former Minister Vemula Prashanth Reddy) గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రెజెంటేషన్ ఇస్తానంటున్నారని, ఏం.. ఇంకా కాళేశ్వరంపై అబద్దాల వంటకం పూర్తి కాలేదా..? అని బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.
ఈ 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏం చేసింది..?, ఎప్పుడు ఎవరినీ జైళ్లో వేయాలా అని ఆలోచించడం తప్పితే ఏం చేశారు..? అని ఆయన ప్రశ్నించారు. కొణతం దిలీస్ విమానాశ్రయంలో దిగగానే అర్థరాత్రి అరెస్టు చేసి నిర్మల్ పంపాల్సిన అవసరముందా..?, హైడ్రా ఉపయోగించి పేదల ఇళ్లు కూల్చడం, కేసులు, ఎంక్వయిరీలు కమిషన్లపై వెచ్చించే సమయాన్ని పాలనపై వెచ్చించడం తప్ప ఏం చేశారు..? అని అడిగారు. వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. 600 రోజులు గడిచిపోయాయి.. హామీలు మాత్రం అమలు కాలేదని, ఇంకెప్పుడు చేశారని రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.