12-06-2025 04:53:35 PM
అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే కూలిన విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, ఇద్దరు నవజాత శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ప్రమాదంపై దర్యాప్తునకు ఎయిర్ ఇండియా పూర్తిగా సహకరిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రయాణికుల సమాచారం కొరకు 1800 5691 444 నంబరు అందుబాటులోకి తీసుకోచ్చినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.