15 June, 2026 | 1:55 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

కళలపై వెంకయ్య కీలక సూచన

08-07-2024 01:06 AM

కళలను విద్యా ప్రణాళికలో భాగం చేయాలన్న మాజీ ఉపరాష్ట్రపతి

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి భారతీయ కళలను విద్యాప్రణాళికలో భాగం చేయాలని మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం నాగ భైరవ ఆరుషి కూచి పూడి నాట్య రంగ ప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. “భారతీయ నృత్యాల్లో ప్రావీణ్యం సాధిస్తే శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, గ్రహణశక్తి పెరుగుతుంది. హావభావాల ప్రకటన సామర్థ్యం పెరిగి ఆత్మవిశ్వాసం ఇనుమ డిస్తుంది. క్రమశిక్షణ, సహనం, సంయమనం, సమన్వయ శక్తి పెరుగుతాయి. అందుకే భారతీయ కళలను విద్యా ప్రణాళికలో భాగం చేయాలి” అని సూచించారు.