calender_icon.png 17 June, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ్ రూపానీ అంత్యక్రియలు పూర్తి

17-06-2025 01:03:43 AM

-రాజ్‌కోట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు

- కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం భూపేంద్ర పటేల్ తుది నివాళి

- కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ లభ్యం

అహ్మదాబాద్, జూన్ 16: గుజరాజ్ మా జీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశా యి. రాజ్‌కోట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు రాజ్‌కోట్‌లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం విజయ్ రూపానీ భౌతికకాయాన్ని ఉంచారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి  పుష్పగుచ్చాలు సమర్పించి తుది నివాళి అర్పించా రు. అనంతరం మధ్యాహ్నం ప్రారంభమైన అంతిమయాత్ర రెండు గంటల పాటు సాగింది. విజయ్ రూపానీ మృతదేహాన్ని తీసుకెళ్లే వాహనంపై సుమారు 20 క్వింటాళ్ల పూలను ఉపయోగించారు.

కాగా రూపానీ భార్య అంజలి ఆయనకు తుది వీడ్కోలు పలికేటప్పుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యా రు. గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే మంటల్లో మృతదేహాలు పూ ర్తిగా కాలిపోవడంతో ఆయన్ను గుర్తించేందు కు అధికారులకు మూడు రోజుల సమయం పట్టింది. డీఎన్‌ఏ టెస్టుల సాయంతో రూపానీ మృతదేహాన్ని ఆదివారం గుర్తించిన అధికారులు ఆయన పార్థీవ దేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు.

కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ స్వాధీనం

విమాన ప్రమాద ఘటనలో విచారణకు అత్యంత కీలకమైన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్) సోమవారం ఉదయం లభ్య మైంది. ప్రమాద స్థలంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబి) అధికారులు గాలించి సివిఆర్‌ను వెలికితీశా రు. ఇందులో పైలట్ సంభాషణలు, రేడి యో ట్రాన్స్ మిషన్లు, వార్నింగ్ అలారంలు రికార్డయి ఉంటాయి.

ప్రమాదానికి కారణాలేమిటన్నది గుర్తించడంలో కీలక సాక్ష్యంగా ఉపయోగపడనుంది. కాగా ఇప్పటికే డిజిట ల్ ఫ్లుటై రికార్డర్‌తో పాటు బ్లాబ్ బాక్సులన స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సె క్రటరీ పీకే మిశ్రాకు అధికారులు తెలిపారు.