17-06-2025 01:04:56 AM
భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ ప్రథమ మహిళ ఫిలిప్పా కార్సేరాకు వెండి క్లచ్ పర్సును కానుకగా అందించా రు. కాగా ఈ వెండి క్లచ్ పర్సు ను ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ లోహపు పనితో ఆధునిక శైలి లో రూపొందించారు. కాగా పర్సుపై దేవాలయాలపై ఉన్న ఆకృతులు, రాజుల కాలం నుంచి ప్రేరణ పొందిన పూల డిజైన్లను ముద్రించారు.