17-06-2025 01:01:28 AM
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జెరూసలెం, జూన్ 16: ఇరాన్తో యు ద్ధం వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఇరా న్కు అమెరికా అధ్యక్షుడే ప్రధాన శత్రువని ఆరోపించారు. ట్రంప్ సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడన్నారు. బలహీనమై న రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరని, ప్రత్యర్థికి లొంగిపోరని తెలిపారు.
గతంలోనూ ఆయన ఒక నకిలీ ఒప్పందాన్ని పక్కనబెట్టి ఖాసిమ్ సులేమానీని మట్టుబెట్టారని గుర్తచేశారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని, ఒకవేళ ఉన్నా వారు యురేనియంను శుద్ధి చేయకుండా అడ్డుపడాలనుకున్నారన్నారు. అందులో భాగంగానే ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీంతో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారిపోయారని, అందుకే టెహ్రాన్ ఆయన్ను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. అణ్వాయుధాలను ప్రోత్సహిస్తూ ఇరాన్ ప్రపంచ దేశాలన్నింటికీ పెనుముప్పుగా మారుతోందని నెతన్యాహు దుయ్యబట్టారు. అందుకే దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందన్నారు. దాడులతో ఇజ్రాయెల్ తమ సొంత ప్రజలను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని రక్షిస్తోందన్నారు.