22-10-2025 05:22:27 PM
ములకలపల్లి (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి క్రాంతి తమ్ముడు పోతుగంటి సిద్దయ్య ఇటీవల అనారోగ్య సమస్యతో మృతిచెందగా బుధవారం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మెచ్చా నాగేశ్వరరావు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొయ్యల అచ్యుత్ రావు, కేవీ, తాటి పోతురాజు, తుర్రం శ్రీను, భాస్కర్ రావు, భూమయ్య, సోడే కేశవ రావు, నరేష్, కొండ్రు మధు, మండల యువజన విభాగ అధ్యక్షుడు తాటి ప్రవీణ్, చంటి, మడకం కృష్ణ మూర్తి, నరసింహ రావు, రావుల కృష్ణ, కుప్పల గోపి తదితరులు ఉన్నారు.