calender_icon.png 5 November, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే అవగాహన లోపంతో నీట మునిగిన మోడల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు

05-11-2025 08:43:45 PM

అందెలు శ్రీరాములు యాదవ్..

మహేశ్వరం (విజయక్రాంతి): ఎమ్మెల్యే సబితా రెడ్ది అవగాహన లోపంతో నీట మునిగిన మోడల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలతో పాటు అగ్నిమాపక కేంద్రం నీట మునిగాయని రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. చెరువులు, కుంటలు, కాలువలు మాయం అవుతున్న పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన నీట మునిగిన పాఠశాలలను, కేంద్రాన్ని సందర్శించిన ఆనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేశ్వరం మండల కేంద్రంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు రామచంద్ర గూడెంలోని చెరువు నిండడంతో గ్రామంలోకి నీరు భారీగా పోటెత్తడం ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారన్నారు.

కస్తూర్బా బాలికల పాఠశాల, మోడల్ స్కూల్, అగ్నిమాపక కేంద్రంలోకి వరద ముంచెత్తిందని అన్నారు. సబితా లోపం వల్లే నేడు ఈదుస్థితి నెలకొందన్నారు. మహేశ్వరంలో అనేక చెరువులు, కుంటలు కాల్వలు మాయమవుతున్న పట్టించుకోవడం లేదని తన హయాంలోనే మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల, అగ్నిపాపక కేంద్రంగాని నిర్మించారని, కనీసం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించకుండా ఇట్టి స్థలాలలో ఈ నిర్మాణాలు పూర్తి చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రైవేట్ కంపెనీలకు ఎత్తు స్థలాలు కేటాయించి నిరుపేదలు చదువుకునే పాఠశాలలకు లోతట్టు ప్రాంతాలలో భూమిని కేటాయించి నిర్మాణం చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే హైడ్రా అధికారులు కూడా గ్రామాలలో పర్యటించి అన్యాక్రాంతం అవుతున్న చెరువులను, కాలువలను గుర్తించి ఇక్కడి ప్రజలకు మునుముందు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుండే వెంకటేష్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోతర్ల సుదర్శన్ యాదవ్, జిల్లా బిజెపి కార్యదర్శి యాదయ్య గౌడ్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రవణ్, ఉపాధ్యక్షులు చెన్నా రెడ్డి, నరసింహ, మండల కార్యదర్శి దేవేందర్, మాజీ ప్రజాప్రతినిధులు సురేష్, శ్రీరాములు యాదవ్, రఘువీర్, జాపాల సుధాకర్, బీజేవైఎం నాయకులు దేవేందర్, సీనియర్ నాయకులు కాకి పరమేష్, పాండు నాయక్, గణేష్ నాయక్, వెంకటేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్, నరేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.