24 April, 2026 | 12:20 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

సరైన దారిలోనే ఉన్నాం..

20-03-2025 12:07 AM

ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..

జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..

యుద్ధాన్ని ముగించడానికి అమెరికాతో కలిసి పని చేస్తాం: జెలెన్‌స్కీ 

వాషింగ్టన్: ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జరిపిన ఫోన్ సంభాషణ చాలా బాగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. జెలెన్‌స్కీతో దాదాపు గంటపాటు ఫోన్‌లో మాట్లాడినట్టు తన సొంత సామాజిక మాద్యమం ట్రూత్ సోషల్ వేదికగా బుధవారం వెల్లడించారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తాను జరిపిన చర్చలపైనే తాము ఎక్కువ సేపు మాట్లాడుకున్నట్టు స్పష్టం చేశారు. ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరు వర్గాల అభ్యర్థనలు, అవసరాలపై తమ చర్చలు జరిగినట్టు తెలిపారు.

శాంతి ఒప్పందానికి సంబంధించి సరైన దారిలోనే మందుకెళ్తున్నట్టు చెప్పారు. అలాగే చర్చలకు సంబంధించిన వివరాలను రూపొందించాలని విదేశాంగ మంత్రి మర్కా రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్‌ను ఆదేశించనున్నట్టు తెలిపారు. అతి త్వరలో వాళ్లు ఈ చర్చలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ మంగళవారం 2 గంటలపాటు ఫోన్‌లో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో 30 రోజులపాటు ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేయడానికి పుతిన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌తో జెలెన్‌స్కీ ఫోన్‌లో సంభాషించారు. 

సానుకూలంగా సాగిన సంభాషణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ సంభాషణ సానుకూలంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. యుద్ధానికి ముగింపు పలికి శాంతిని స్థాపించడం కోసం ఇరు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అమెరికా నాయకత్వంలో ఈ ఏడాది శాంతి స్థాపన జరుగుతుందని తాము విశ్వసిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌తో ఫోన్ సంభాషణకు ముందు కాల్పుల విరమణకు ఒప్పుకుని కూడా రష్యా తమపై దాడులు జరుపుతూనే ఉందని జెలెన్‌స్కీ ఆరోపించారు.