24 March, 2026 | 2:38 AM

క్షయను అంతం చేయగలం

24-03-2026 01:06 AM

కామినేని ఆస్పత్రి వైద్యుడు రవీంద్ర రెడ్డి

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాం తి): మార్చి 24న నిర్వహించే ’ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం’ సందర్భంగా 2026లో ‘అవును! మనం క్షయను అంతం చేయగల ము’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని, కేవలం వ్యాధి నియంత్రణ మాత్ర మే కాకుండా, సంపూర్ణ నిర్మూలన దిశగా ప్ర భుత్వాలు, ప్రజలు సమష్టిగా పోరాడాలని డాక్టర్ ఇ రవీంద్రరెడ్డి (సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్, ఎల్‌బీ నగర్) పిలుపునిస్తున్నారు. క్షయ నిర్మూలన లో జాతీయ ప్రభుత్వాలు అగ్రభాగాన నిలవాలని 2026 లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయని చె ప్పారు.

‘ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రతి ఒక్కరికీ నా ణ్యమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరం.  వైద్య చికిత్సలు మాత్రమే క్షయను అంతం చేయలేవు; సమాజ భాగస్వామ్యం ఇక్కడ అత్యంత కీల కం. ఈ ఏడాది థీమ్లో ‘ప్రజల భాగస్వా మ్యం‘ అనేది ఒక కీలక స్తంభం. వ్యాధి పట్ల ఉన్న సామాజిక వివక్షను తొలగించడంలో పౌర సమాజం, ఆరోగ్య కార్యకర్తలు కీలక పా త్ర పోషించాలి. లక్షణాలు ఉన్నవారు వెంట నే పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, రోగులు మందులు క్రమం తప్పకుం డా వాడేలా చూడటం ద్వారా వ్యాధి వ్యాప్తి ని అరికట్టవచ్చు అని ఆయన చెప్పారు.