14-06-2025 12:45:40 AM
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
కోహీర్, జూన్13: అధిక పంట దిగుబడులు సాధించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తల అనుభవాలు ఎంతగానో ఉపయోగ పడతాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని బిలాల్ పూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట శాస్త్ర వేత్తలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సస్య రక్షణ, ఎరువుల వాడకం పట్ల సరైన అవగాహన కల్పించడం ద్వారా రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. అనుభజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు సలహాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం, వసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు పంటల సాగు పట్ల రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ చంద్ర శేఖర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్య, జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్,
బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్ర వేత్త విజయ కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రామలింగ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్షద్ అలీ, మాజీ జెడ్ పీటీసీ రాందాస్, మాజీ ఎంపీపీ శౌకత్ అలీ, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్, మాజీ ఎంపీటీసీ మల్లన్న పాటిల్ నాయకులు, రైతులుపాల్గొన్నారు.