17 April, 2026 | 3:31 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఉపాధి హామీ మహిళా కూలీలకు ఆత్మీయ భరోసా తక్షణమే అందించాలి

14-06-2025 12:46 AM

సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు.రణపంగ కృష్ణ 

పెన్ పహాడ్: జాతీయ ఉపాధి పథకం లో భాగంగా పని చేస్తున్న మహిళా కూలీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆత్మీయ భరోసా ద్వారా రూ.12,000 అందించే ఆదుకోవాలని   సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణప్పంగ కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.  శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామంలో ఉపాధి హామీ కూలీల లతో   కలసి ఉపాధి హామీ పనులను పరిశీలించి మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధి హామీ మహిళ  కూలీలకు . సంవత్సరానికి 12,000 రూపాయలు  ఆత్మీయ భరోసా కింద ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి 12 వేల రూపాయలతో పాటు జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అలాగే ఇంటి స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇట్టి స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని దినాలు సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించాలని కొలతలు లేకుండా రోజుకు 700 రూపాయలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ మెట్లు రణపంగ శ్రీకాంత్ సుకన్య, రజిని, సుజాత, సైదమ్మ, గురమ్మ, శాంత, చిట్టి, పద్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.