8 April, 2026 | 4:11 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక— హెల్ప్ లైన్ నంబర్లు ఇవే   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

హైడ్రా బాధితులకు అండగా ఉంటాం

29-10-2024 03:10 AM
  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  2. పలువురికి పరామర్శ

కూకట్‌పల్లి, అక్టోబర్ 28: హైడ్రా బాధితులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో తమ ఇంటిని కూడా కూల్చేస్తారనే భయంతో గత నెల 27న కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఆమె కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉందన్నారు. ఎక్కడ నా ఇల్లు కూలగొడతారో అని బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమెది ఆత్యహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్‌రెడ్డి చేయించిన హత్య అని ఆరోపించారు.

పెద్దపెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ల దగ్గర చందాలు వసూలు చేయడం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు. 

శేరిలింగంపల్లి: హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటితో పాటు తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీని, కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వేదశ్రీకి పుస్తకాలతో పాటు బ్యాగులను అందించారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.