19-05-2025 12:00:00 AM
తెలంగాణ సినిమా వేదిక (టీసీవీ) హెచ్చరిక
ముషీరాబాద్, మే 18 (విజయక్రాంతి) : గద్దర్ ఫిలిమ్ అవార్డును తెలంగాణ సినిమాలకు ఇవ్వకపోతే అడ్డుకుంటామని తెలం గాణ సినిమా వేదిక(టీసీవీ)రాష్ట్ర కమిటీ ప్ర భుత్వాన్ని హెచ్చరించింది. ఆదివారం చిక్కడపల్లిలో మీడియాతో టీసీవీ రాష్ట్ర నేతలు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, టీసీవీ రా ష్ట్ర గౌర వ సలహాదారు, లారా రాష్ట్ర కన్వీనర్, మో హన్ బైరాగి, కో-కన్వీనర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్న మన సినిమా రంగంపై ఆంధ్ర సినిమా పెద్దల ఆధిపత్యం కొనసాగుతుందని అన్నా రు.
పేరుకే తెలంగాణ ఫిలిం చాంబర్గా ఉండి ఫిలిం అవార్డులు ఆంధ్ర ఫిలిం ఛాం బర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు థియేటర్లు మాఫియా నడుస్తుందన్నారు. తెలంగాణ సినిమా రంగం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించాలన్నారు. గద్దర్ ఫిలిం అవార్డు తెలంగాణ సినిమాలకు ఇవ్వకపోతే గద్దర్ ఫిలిం అవార్డు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో టిసివి నాయకులు రవి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.