26-06-2025 12:33:00 AM
అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో పలు గ్రామల్లో
రూ.1.43 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 25: ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని అబ్దుల్లాపూర్, కవాడిపల్లి, బండరావిరాల, చిన్నరావిరాల, బాటసింగారం, జఫర్గూడ, ఇనాంగూడ, లష్కర్గూడ గ్రామాల్లో బుధవారం స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అన్నిగ్రామాల్లో ప్రగతికి బాటలు వేస్తామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి అధిక నిధులు తెవడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించేలా సీఎం రేవంత్రెడ్డి కోరుతానని తెలిపారు. రానున్న మూడున్నర ఏండ్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు.
గడిచిన పదేండ్లలో గత ప్రభుత్వం రూ.9లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఆ అప్పులను తీర్చుకుంటూ.. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రాజీవ్ యువ వికాస్ ద్వారా నిరుపేద యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. పేదల సంక్షేమానికి సీఎం రేవంత్ పెద్దపీఠ వేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి, మాజీ ఎంపీపీ రేఖామహేందర్గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బింగి దేవదాస్గౌడ్, మాజీ ఎంపీటీసీ కేశెట్టి వెంకటేశ్, గౌస్పాషా పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుతదితరులున్నారు.