calender_icon.png 26 June, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు

26-06-2025 12:31:15 AM

  1. భూమిని తనఖా పెట్టిన అసైన్డ్ లబ్ధిదారుడు  

భూమి చుట్టూ ప్రీ క్యాస్ట్ నిర్మించిన బ్యాంకు అధికారులు 

సర్కారు భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు 

రాజేంద్రనగర్, జూన్ 25: ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్ మీడియాకు వెల్లడించారు. మండల పరిధిలోని మదనపల్లిలో సర్వేనెంబర్ 50లో సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో కొందరికి అందులో లావుని పట్టాలు ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఇటీవల కొన్ని రోజుల క్రితం బ్యాంకు అధికారులు సుమారు రెండున్నర ఎకరాల భూమికి ప్రీ క్యాస్ట్ వాల్ నిర్మించారు. ఈ విషయమై శంషాబాద్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. ఘటనపై విచారణ జరిపించగా గతంలో లావుని పట్టా తీసుకున్న ఓ వ్యక్తి సదరు భూమిని ఓ బ్యాంకులో తనఖా పెట్టాడు. అతడు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ భూమికి ప్రీ క్యాస్ట్ ఏర్పాటు చేశారు.

బుధవారం శంషాబాద్ తాసిల్దార్ రవీందర్ దత్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని ఫ్రీ క్యాస్ట్ నిర్మాణాలను కూల్చివేశారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందజేసిన భూములకు సంబంధించి ఎలాంటి దావాదేవీలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ రవీందర్ హెచ్చరించారు. ఎలాంటి క్రయవిక్రయాలు చెల్లవని ఆయనస్పష్టంచేశారు.