calender_icon.png 23 June, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక నృత్యాలు

23-06-2025 01:39:01 AM

శేరిలింగంపల్లి, జూన్ 22: శిల్పారామం మాదాపూర్‌లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగం గా ఆదివారం నృత్య దీక్షలయా గురు వు లక్ష్మి శంకర్ శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

జగదానంద కారకా, జతిస్వరం, గీత రసికే, మండూ క శబ్దం, అప్సరసలు, నమశ్శివాయతే, వందే మీనాక్షి,రామాయణ శబ్దం, పరమ పురుషుడు, మంగళం,వంటి అంశాలను ఆధ్య, ఆశ్రిత, అమృత, అవంతిక, అవిజ్ఞా, గాయత్రీ, వెంకట్, జీవిత, కార్తీక, నందిని, పూర్వీక, రితిక మొదలైన కళాకారులు ప్రదర్శించి సందర్శకు లను ఎంతగానో ఆకట్టుకున్నారు.