11-02-2026 12:36:14 AM
1352 ఎకరాల భూమిని కాపాడాలి
అఖిలపక్ష నాయకుల ర్యాలీ
తాసిల్దార్ కు వినతి
గోపాలపేట ఫిబ్రవరి 10: ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రాజెక్టులు ఎవరి లబ్ధి కోసం కోసం పాకులాడుతున్నారు. ప్రాజెక్టులు మా కు వద్దు మా భూములే మాకు ముద్ద అం టూ అఖిలపక్ష నాయకులు నినాదాలు చే స్తూ పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. వనపర్తి జిల్లా మండలం శివారులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి చీరుకుపల్లి సరిహద్దుల్లో రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్మాణo చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో.
అగ్ర ప్రాజెక్టు నిర్మాణం వద్దని వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో 43 వ రోజు కు చేరుకుంది ఈసందర్భంగా మంగళవారం అఖిల పక్షం నాయకులు శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం గొల్లపల్లి బస్టాప్ దగ్గర నుంచి అఖిలపక్ష నాయకులు మరియు రై తులు పాదయాత్రగ బయలు దేరారు. ఏదు ల మండల తహసీల్దార్ కు గొల్లపల్లి చీర్కపల్లి చెన్నారం రిజర్వాయర్ నిర్మాణం చేయ కుండా పై అధికారులకు మా రిజర్వాయర్ బాధితుల గోసని తెలియచేయాలని మరియు 1352 ఎకరాల వ్యవసాయ భూమినీ కాపాడాలని తహసీల్దార్ కు వినతి పత్రము అందజేశారు.
ఈ కార్యక్రమంలో త లారి కుర్మయ్య, అబ్దుల్ మహమూద్ , మా జీ ఎంపీటీసీ రాజురెడ్డి దొడ్ల ఇందిరా, రేణు క, శాంతమ్మ,విజయ్ మోహన్ , చంద్రకళ,బోయ వెంకయ్య,శ్రీవర్దన్ రెడ్డి, నితీష్ కు మార్ , బంకల సునిల్ , జెట్టి కృష్ణయ్య, క ళ్యాణ్ స్వామి,లక్ష్మణ్, ప్రేమ్ కుమార్, జెట్టి రామచందర్. జెట్టి దర్గయ్య, దస్తాయ్య, సు బ్బారెడ్డి, మల్లికార్జున్, నరేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, బుచ్చిరెడ్డి, కృపాకర్ రెడ్డి, గాజుల బాబు, స్వామి,బోయ గోవింద్, అబ్దుల్లా రైతులు తదితరులు పాల్గొన్నారు.