13-02-2026 04:47:35 PM
షాద్నగర్ ఫిబ్రవరి 13, (విజయక్రాంతి): ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన భార్య గెలుపొందగా..భర్త ఓటమి చెందారు.ఈ సంగటన షాద్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున షాద్నగర్ పట్టణంలోని తొమ్మిదవ 9వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున చేకూరి వేణుగోపాల్ పోటీ చేయగా ఆయన సతీమణి లక్ష్మీ ప్రసన్న 28వ వార్డు నుంచి రంగంలోకి దిగింది అయితే శుక్రవారం వెలుబడిన మున్సిపల్ ఫలితాలలో భార్య లక్ష్మీప్రసన్న విజయం సాధించగా, భర్త వేణుగోపాల్ పరాజయం పాలయ్యారు.