మహిళలు ప్రతిరంగంలో ముందుండాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, మార్చి 11 (విజయక్రాంతి): మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘూవాన్ అన్నారు. బుధవారం జిల్లా వయోవృద్ధుల, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహిం చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కలెక్టర్, రాష్ట్ర, దేశ స్థాయిలో విద్య, ఉద్యోగం, ఉపాధి, క్రీడా రంగాల్లో, స్వచ్ఛంద సంస్థల కు చెందిన ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. ఐడీఓసీలోని వివిధ విభాగాలకు చెందిన మహిళల కోసం ఆటలు, పాటలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
మొత్తం 150 మంది మహిళలను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శాలువాలు, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యమై పెద మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చిన సోనియా శంకరును అభినందిం చారు. ఆమెను శాలువాతో సన్మానించి జ్ఞాపకను అందజేశారు.
బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ సీమా సెట్కార్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, అడిషనల్ డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీఆర్ఓ తిరుమల, సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత, జిల్లా మహిళా సాధికారత కేంద్ర సిబ్బంది శారద, తులసి, సౌందర్య, అరుణ్ కుమార్, బాల రక్షాభవన్ అధికారి స్రవంతి, చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ సిబ్బంది, సఖి కేంద్రం సిబ్బంది కవిత పాల్గొన్నారు.




