గెలుపే లక్ష్యంగా పని చేయాలి

23-04-2024 02:08:55 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్‌చెరు, ఏప్రిల్ 22 : మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పటాన్‌చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నాయకులు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయా లన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి వెంకట్రాంరెడ్డికి రికార్డు మెజార్టీని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, మాజీ కార్పొరే టర్ శంకర్‌యాదవ్, గూడెం యాదమ్మ, ఎంపీపీ సుష్మావేణుగోపాల్, జడ్పీటీసీ సుప్రజవెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, కుమార్‌గౌడ్, పాండు పట్టణ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.