5 May, 2026 | 7:01 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ధోనీని నేను క్షమించను.. యువరాజ్ సింగ్ తండ్రి

02-09-2024 11:59 AM

ముంబయిక్రికెట్ దిగ్గజం ఎం ఎస్ ధోని పై  యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ మండిపడ్డారు. స్విచ్ అనే యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేశారు. ధోనీ తన కొడుకు కెరీర్ ను నాశనం చేశాడని ఆయన ఆరోపించారు.  యోగ్ రాజ్ సింగ్ మండి పడ్డారు. యూవీ క్రికెట్ జీవితాన్ని కనీసం నాలుగేళ్లు తగ్గించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత జట్టుకు చాలా షహకారం అందించాడని గొప్ప ఆల్ రౌండర్ అని ప్రశంసించారు.

ఇద్దరూ జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో యూవీ కెరీర్ ను ధోని ఇబ్బందుల్లోకి నెట్టాడని ఆరోపించారు. ఇంకా నాలుగైదేళ్లు ఆడగల నాకొడుకు జీవితాన్ని అతడు నాశనం చేశాడు. యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ అసమానమైనదని, తన కెరీర్‌లో 'సెకండ్ ఇన్నింగ్స్' కూడా ఉందని, క్యాన్సర్‌పై గెలిచిన తర్వాత చిరస్మరణీయ రీతిలో పునరాగమనం చేశాడని ఆయన గుర్తుచేసుకున్నారు.  ఎంఎస్ ధోనీ ని నేను క్షమించను.  యువరాజ్ సింగ్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.