ధోనీని నేను క్షమించను.. యువరాజ్ సింగ్ తండ్రి
ముంబయి: క్రికెట్ దిగ్గజం ఎం ఎస్ ధోని పై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ మండిపడ్డారు. స్విచ్ అనే యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేశారు. ధోనీ తన కొడుకు కెరీర్ ను నాశనం చేశాడని ఆయన ఆరోపించారు. యోగ్ రాజ్ సింగ్ మండి పడ్డారు. యూవీ క్రికెట్ జీవితాన్ని కనీసం నాలుగేళ్లు తగ్గించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత జట్టుకు చాలా షహకారం అందించాడని గొప్ప ఆల్ రౌండర్ అని ప్రశంసించారు.
ఇద్దరూ జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో యూవీ కెరీర్ ను ధోని ఇబ్బందుల్లోకి నెట్టాడని ఆరోపించారు. ఇంకా నాలుగైదేళ్లు ఆడగల నాకొడుకు జీవితాన్ని అతడు నాశనం చేశాడు. యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ అసమానమైనదని, తన కెరీర్లో 'సెకండ్ ఇన్నింగ్స్' కూడా ఉందని, క్యాన్సర్పై గెలిచిన తర్వాత చిరస్మరణీయ రీతిలో పునరాగమనం చేశాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంఎస్ ధోనీ ని నేను క్షమించను. యువరాజ్ సింగ్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.






