20-09-2025 11:20:36 AM
ఇంట్లో పై కప్పు కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సింగరేణి యువ కార్మికుడు...
గోదావరిఖని 8వ కాలనీలో ఘటన..
గోదావరిఖని,(విజయక్రాంతి): పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ సింగరేణి యువ కార్మికుడు ప్రాణాలు తీసుకున్న హృదయ విధారకర ఘటన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 8వ కాలనీలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున తప్పెట్ల పవన్ కుమార్ 27 ఏళ్ల వయసు గల యువకుడు తన నివాస ముండే సింగరేణి క్వార్టర్ లో ని బెడ్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది మహబూబ్ బాద్ జిల్లా మల్యాల గ్రామం కాగా, సింగరేణి ఏ. ఎల్. పి గనిలో సీనియర్ సర్దార్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి గోదావరిఖని 2-టౌన్ సీఐ ప్రసాద్ రావు, సిఐ లింగన్న చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.