08-12-2025 12:00:00 AM
పాపన్నపేట, డిసెంబర్ 7 :మండల పరిధిలోని రామతీర్థం గ్రామానికి చెందిన అంబేద్కర్ ఆదర్శ యువజన సంఘం యు వకులు ఆదివారం గ్రామంలోని ఇరు కు టుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. సంఘం వినోద-ప్రభాకర్ దంపతులు ఇటీవల మృతి చెందగా వారి ఇద్దరు చిన్నారులు దీపిక, అంజలి అనాధలయ్యారు. కాగా వా రికి యువజన సంఘం తరఫున రూ.4 వేలు అందించారు.
అలాగే కుటుంబ పెద్దయిన ఎరుకల ఎల్లయ్య మృతిచెందగా వారి కు టుంబానికి రూ.3వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశం, ఉపాధ్యక్షుడు కృష్ణ, జనరల్ సెక్రటరీ ప్రసాద్, బాబు, సభ్యులు మచ్చేందర్, బాగయ్య, దశరథ్, శేఖర్, బన్నీ, భాను, శ్రీశైలం, సురేష్, అనిల్, శ్రీకాంత్, స్వామి, జాను తదితరులు ఉన్నారు.